ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో తెలంగాణలో షర్మిల దీక్ష..!

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందని ప్రకటించిన షర్మిల.. తాజాగా తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయాలని హైదరాబాద్ లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టారు. తెలంగాణలో ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. షర్మిలా ఈ దీక్షను 72 గంటల పాటు నిర్వహించాలని భావిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ఒక్కరోజుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. 

దీంతో ఈ సాయంత్రం 5 గంటల వరకు షర్మిల దీక్షను నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. నిరుద్యోగుల కోసం దీక్ష చేపడతానని షర్మిల ఇటీవల ఖమ్మం సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.. కాగా కేసీఆర్ వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని వామపక్ష, నిరుద్యోగ, ప్రజాసంఘాలు, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రతి సారీ టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఇప్పుడు షర్మిల దీక్ష చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. 

Leave a Comment