కర్నూలులో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ దొరికాడు..!

ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో రంగంలో దిగి దాడులు చేస్తున్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ సురేంద్ర బాబు రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.  

ఓ కాంట్రాక్టర్ చేపట్టిన రూ.1.15 కోట్ల బిల్లుల మంజూరుకు ఎస్ఈ రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ విషయమైన ఏసీబీ అధికారులకు కాంట్రాక్టర్ సమాచారం ఇచ్చాడు. కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడి కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.   

 

Leave a Comment