ప్రమాదం తర్వాత తొలిసారిగా ట్వీట్ చేసిన సాయిధరమ్ తేజ్..!

గతనెల 10న దుర్గం చెరువు వద్ద కేబుల్ బ్రిడ్జిపై బైక్ మీద ప్రయాణిస్తూ సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. గత కొద్ది రోజులుగా అపస్మారక స్థితిలో ఉన్న తేజ్ ఇప్పుడు కోలుకుంటున్నారు.

 అయితే ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అని అభిమానుల్లో ఆందోళన ఉంది. ఈక్రమంలో ఆయన తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. ‘నాపై రిపబ్లిక్ మూవీపై మీరు చూపించే ప్రేమ, అభిమానానికి.. థ్యాంక్స్ చెప్పడమనేది ఓ చిన్నపదం మాత్రమే.. త్వరలోనే మీ ముందుకొస్తా’ అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. డన్ అనే అర్థం వచ్చేలా థంబ్ చూపిస్తూ ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు సంతోషపడుతూ రీట్వీట్లు చేస్తున్నారు. 

Leave a Comment