అనాథ శవాన్ని 2 కి.మీ. భుజాలపై మోసిన మహిళా ఎస్సైకి సెల్యూట్..!

ఓ మహిళా ఎస్సై తన మానవత్వాన్ని చాటుకుంది. తన భుజాల మీద ఓ అనాథ శవాన్ని మోసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆపద వచ్చినప్పుడు పోలీసులు ముందుంటారని నిరూపించింది శ్రీకాకుళం జిల్లా కాసీబుగ్గ ఎస్సై కె.శరీష.. వివరాల మేరకు పలాసలోని కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్దుడి మృతదేహం లభ్యమైంది. 

అయితే ఆ మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష తానే స్వయంగా భుజాలపై మృతదేహాన్ని 2 కిలోమీటర్ల దూరం మోసుకుని అంత్యక్రియల కోసం లలితా చారిటబుల్ ట్రస్టుకు అప్పజెప్పారు. ఎస్సై శిరీష చేసిన పనికి పోలీసులతో పాటు స్థానికులు ప్రశంసిస్తున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ శిరీషను ప్రత్యేకంగా అభినందించారు.   

 

Leave a Comment