నా కొడుకును పోలీసులే చంపేశారు.. రాజు తల్లి ..

సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఘట్ కేసర్ వద్ద రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతిపై మౌనిక అనే టాటూ ఉండటంతో పోలీసులు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు ధ్రువీకరించారు. ఈ మరణ వార్త చూసి రాజు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

ఈసందర్భంగా రాజు తల్లి మీడియాతో మాట్లాడింది. తన కొడుకును పోలీసులే చంపి రైల్వే ట్రాక్ పై పడవేశారని ఆరోపించింది. తమను పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లి తమ నుంచి అన్ని వివరాలు సేకరించి రాత్రి ఉప్పల్ లో వదిలేశారని తెలిపింది. ఇక ఆదివారం రోజు నా కొడుకు రాజు రైల్వే స్టేషన్ లో దొరికాడని, దొరికిన వెంటనే నా కొడుకుని ఎన్ కౌంటర్ చేయాలని పై నుంచి ఆర్డర్ వచ్చినట్లు పోలీసులు అనుకున్నారని, అది నేను విన్నానని రాజు తల్లి చెప్పింది. 

ఈ ఘటన జరిగిన నాటి నుంచి తమ ఇంటికి రాని పోలీసులు నిన్న వచ్చారని తెలిపింది. దీంతో తమకు అనుమానం కలిగిందని చెప్పింది. నా కొడుకు రాజు ఆత్మహత్య చేసుకోలేదని, పోలీసులే కావాలనే చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకు పోలీసులకు మూడు రోజుల కిందే దొరికాడని, ఇన్ని రోజులు ఎక్కడో దాచిపెట్టి ఈ రోజు చంపేశారని రాజు తల్లి తెలిపింది. పోలీసులు అమాయకుడైన తన కొడుకుపై అత్యాచారం కేసు పెట్టి పోట్టన పెట్టుకున్నారని ఆరోపించింది. తన కుమారుడి శవాన్ని తమకు అప్పగించాలని ఆమె కోరుతోంది. 

    

 

Leave a Comment