Breaking News: సైదాబాద్ చిన్నారి కేసు నిందితుడు రాజు ఆత్మహత్య..!

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని రాజు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లాలోని ఘట్ కేసర్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. పల్లకొండ  రాజు అనే వ్యక్తి చిన్నారి చైత్రకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. అనంతరం శవాన్ని గదిలో ఉంచి తాళం వేసి పారిపోయాడు. 

అతడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షలు రివార్డు కూడా ప్రకటించారు. అయినా అతడి ఆచూకీ లభించలేదు. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రాజు చివరికి స్టేషన్ ఘన్ ట్ కేసర్ రైల్వే ట్రాక్ మీద శవమై కనిపించాడు. ఘట్ కేసర్-వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడి చేతిపై మౌనిక అనే పేరుతో ఉన్న పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు అధికార ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.   

 

Leave a Comment