తెలుగు రాష్ట్రాల్లో రూ.2వేల కోట్ల అవకతవకలు

సోదాలపై ఐటీ శాఖ ప్రకటన

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరిపిన ఐటీ సోదాల గురించి ఆదాయపు పన్నుల శాఖ ప్రకటన విడుదల చేసింది. సుమారు రూ.2వేల కోట్ల అవకతవకలను ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు. విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పుణెల్లోని 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఏపీ, తెలంగాణలోని 3 ఇన్ ఫ్రా కంపెనీల్లో సోదాలు నిర్వహించామని, మూడు కంపెనీల్లో నకిలీ బిల్లులు గుర్తించామని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీలో చేసిన సోదాల్లో కీలక పత్రాలు లభించాయన్నారు. లెక్కలు చూపని రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల ఆభరణాలు లభ్యమయ్యాయన్నారు. పలువురికి చెందిన 25కు పైగా బ్యాంకు లాకర్లను సోదాల్లో గుర్తించామన్నారు. ఓ ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలో తనిఖీలు చేశామని వివరించారు.

Leave a Comment