ఆర్బీఐ కొత్త నిబంధనలు : డెబిట్, క్రెటిట్ కార్డులపై ఆంక్షలు

డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల విషయంలో ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులకు అనవసరంగా అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపులు ఇవ్వద్దని ఆర్బీఐ అన్ని బ్యాంకులను ఆదేశించింది. కార్డు వినియోగదారుడి అభీష్టం మేరకే ఆ సౌకర్యాన్ని కల్పించాలని సూచించింది. 

ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవే..

  • క్రెడిట్ కార్డులను అంతర్జాతీయ, ఆన్ లైన్ లావాదేవీలకు, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలకు వాడాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి.
  • వాడకంపై ముందుగానే పరిమితులను పెట్టుకోవచ్చు. పరిమితి దాటి కార్డు ద్వారా లావాదేవీకి ప్రయత్నిస్తే, వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ ఫోన్ కు సమాచారం అందుతుంది.
  • కస్టమర్లు తమ కార్డులను ఏటీఎం, ఎన్ఎఫ్సీ, పీఓఎస్, ఈ-కామర్స్ లావాదేవీలకు వాడకుండా తాత్కాలికంగా నిషేధించుకోవచ్చు.
  • బ్యాంకులు జారీ చేసే క్రెడిట్, డెబిట్ కార్డులు ఏటీఏంలోనూ, పాయింట్ ఆఫ్ సేల్స్ వద్ద మాత్రమే పనిచేస్తాయి. 
  • కస్టమర్లకు వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కు ఖాతాను జత చేస్తారు. ప్రీపెయిడ్, గిఫ్ట్ కార్డులకు మాత్రం వర్తించదు.

డెబిట్, క్రెడిట్ కార్డు సేవలను ఎలా నిర్వహించాలి?

  • మొదట మీ మొబైల్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ బ్యాంక్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
  • అక్కడ కార్డు విభాగంలోకి వెళ్లి, ‘మేనేజ్ కార్డ్స్’ ఎంచుకోవాలి.
  • డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అనే ఆప్షన్లు ఉంటాయి. వాటిలో మనకు కవాల్సిన దాన్ని ఎంచుకుని డిసేబుల్ చేయాలి.
  • మళ్లీ కావాలనుకున్నప్పుడు దానిని ఎనేబుల్ – డిసేబుల్ చేసుకోవచ్చు.
  • అలాగే ట్రాన్సాక్షన్ పరిమితిని కూడా సెట్ చేసుకోవచ్చు.

Leave a Comment