చలి, వర్షంలోనూ కొనసాగుతున్న రైతుల ఆందోళన..!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఆందోళనలను ఆదివారంతో 39వ రోజుకు చేరుకున్నాయి. ఒక వైపు చలిలో, మరోవైపు వర్షంలో రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమ నిరసనను కొనసాగిస్తున్నారు. 

ఢిల్లీలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ రైతు తమ గుడారాల్లో చేరి ఆందోళన చేస్తున్నారు. తీవ్రమైన చలి, వర్షం కురుస్తున్నా.. తమకెన్ని ఇబ్బందులు ఎదురైనా చట్టాలను రద్దు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెబుతున్నారు. రైతులు తమ గుడారాల్లోకి చేరిన నీటిని తొలగిస్తున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

 

Leave a Comment