బీజేపీకి ప్రధాని మోడీ విరాళం రూ.1000..!

బీజేపీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ.1000 విరాళం ప్రకటించారు. విరాళం రసీదును ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. తాను బీజేపీకి రూ.వెయ్యి విరాళం ఇచ్చానని, ఎల్లప్పుడూ దేశానికి మొదటి స్థానం ఇవ్వాలనేది తన కోరిక అని పేర్కొన్నారు. బీజేపీకి మైక్రో డొనేషన్స్ ద్వారా సహాయం చేయాలని బీజేపీ మద్దతుదారులను ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మీ సూక్ష్మ విరాళం ద్వారా బీజేపీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. భారతదేశాన్ని బలంగా తయారు చేయడంలో సహకరించాలని ప్రధాని మోడీ కోరారు. 

బీజేపీ చీఫ్ జేపి నడ్డా కూడా పార్టీ ఫండ్ కు రూ.వెయ్యి విరాళంగా ఇచ్చారు. బీజేపీని బలోపేతం చేయడంలో తన వంతు సహకారం అందించానని తెలిపారు. మీరు కూడా ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొని బీజేపీని శక్తిమంతం చేయవచ్చని నడ్డా ట్వీట్ చేశారు. సూక్ష్మ విరాళాలు రూ.5 నుంచి రూ.1000 వరకు ఉందచ్చవని నడ్డా ట్విట్టర్ లో పేర్కొన్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి సందర్భంగా శనివారం బీజేపీ పార్టీ ఫండ్ డొనెషన్ డ్రైవ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ, జేపీ నడ్డా విరాశాలు ఇచ్చారు. 

Leave a Comment