కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలి.. ప్రధాని మోడీ ఉగాది శుభాకాంక్షలు..!

ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ట్వీట్టర్ వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు.. ‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.’ అంటూ ప్రధాని మోడీ ట్వీట్టర్ లో పేర్కొన్నారు.

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్..

ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచులు ఉగాదితో ప్రారంభమయ్యే ప్లవ నామ సంవత్సరంలో ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలని, ఈ ఏడాది కూడా సంవృద్దిగా వానలు కురవాలని, కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’ అంటూ పేర్కొన్నారు. 

సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు..

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నీరు  సంవృద్దిగా ప్రవహించడం ఈ సంవత్సరం ప్రాధాన్యతగా పంచాంగాలు చెబుతున్నాయని, తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత  సంవృద్దిగా లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధిగాంచిందని సీఎం కేసీఆర్ అన్నారు. కోటి ఎకరాలను మాగాణిగా చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అనేక ప్రశంసలు అందుకుంటోందన్నారు. రైతు జీవితాల్లో వసంతాలను తెచ్చి, పున్నమి వెన్నెలను నింపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.  

 

Leave a Comment