తన ఆస్తుల వివరాలను ప్రకటించిన ప్రధాని మోడీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆస్తి విలువ రూ.36.53 లక్షలు పెరిగింది. గాంధీ నగర్ లో ఇల్లు, స్థలం, ఫిక్డ్స్ బాండ్స్ రూపంలో ఉన్న డబ్బుల వివరాలను మోడీ బహిర్గతం చేశారు. జూన్ 30, 2020 నాటికి ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.2.85 కోట్లు ఉన్నట్లు మోడీ స్వయంగా వెల్లడించారు.  ఇటీవల ప్రధాని కార్యాలయానికి సమర్పించిన నివేదికలో తనకు సంబంధించిన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. 

ఆస్తుల వివరాలు..

  • జూన్ నెల ముగిసేనాటికి ప్రధాని మోడీ వద్ద రూ.31,450 నగదు ఉంది.
  • ఎస్బీఐ గాంధీ నగర్ ఎన్ఎస్సీ శాఖకు చెందిన ఆయన బ్యాంక్ ఖాతాలో 3,38,173 రూపాయలు ఉన్నాయి. అదే బ్రాంచ్ లో ఓ ఎఫ్డీఆర్ కూడా ఉంది. 
  • మల్టీ ఆప్షన్ ఫిక్స్డ్ డిపాజిట్ లో రూ.1,60,28,939 నిల్వ ఉన్నాయి. 
  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్(ఎన్ఎస్సీ) విలువ రూ.8,43,124.
  • జీవిత బీమా పాలసీల విలువ రూ.1,50,597
  • టాక్స్ సేవింగ్ ఇన్ ఫ్రా బాండ్ల విలువ రూ.20 వేలు, వీటితో పాటు చరాస్తుల విలువ 1.75 కోట్లకు పైగా ఉంటుందని మోడీ వెల్లడించారు. 
  • మోడీకి ఏ బ్యాంక్ లోనూ రుణాలు లేవు.
  • ఆయనకు సొంత వాహనం లేదు.
  • ఆయన వద్ద సుమారు 45 గ్రాముల బరువుగల నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1.5 లక్షలు.
  • గాంధీ నగర్ లోని సెక్టార్-1 లో తనకు ఓ ప్లాట్ ఉన్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. 

 

Leave a Comment