ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ 20వ చిత్రం ఫస్ట్లుక్ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ను చిత్రం యూనిట్ ఖారారు చేసింది. ఈ సినిమాకు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ‘ఫ్యూచర్ టెల్లర్’గా.. పూజా యువరాణిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో ప్రియదర్శి, బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ చిత్రం యూరప్ నేపథ్యంలో పీరియాడికల్ ప్రేమకథగా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గుల్షన్ కుమార్, టీసీరిస్ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో దిగ్గజంగా పేరొందిన జులియన్ పకియమ్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది.