పోలీసులు తెల్ల పేపర్ పై సంతకాలు తీసుకున్నారు : రాజు భార్య

సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారి చైత్ర హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారం రోజులుగా తప్పించుకుని తిరుగున్న రాజు గురువారం ఉదయం ఘట్ కేసర్ రైల్వే ట్రాక్ వద్ద శవమై కనిపించాడు. కోణార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని రాజు కుటుంబ సభ్యులకు తెలిపారు. 

ఈ ఘటనపై నిందితుడు రాజు భార్య మౌనిక మాట్లాడింది. తన భర్తను పోలీసులు తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త మంచోడని, ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదని తెలిపింది. నిజంగా తన భర్త తప్పు చేసి ఉంటే చట్టపరంగా నిరూపించి శిక్షించాలని, ఇలా చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. తమను పోలీసులు వారం రోజులుగా పోలీస్ స్టేషన్లోనే ఉంచారని, తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారని చెప్పింది. తన భర్తను పోలీసులే చంపేశారని అనుమానంగా ఉందని తెలిపింది. మమ్మల్ని చూసేవారు ఎవరూ లేరని, తమకు న్యాయం చేయాలని కోరింది. 

Leave a Comment