ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. ఎండలకు మనుషులే కాదు జంతువులు సైతం అల్లాడిపోతున్నాయి. దాహార్తి తీర్చుకునేందుకు జంతువులు అడవి నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈక్రమంలో మంచి నీటి కోసం ఓ కోతి విలవిల్లాడింది.. దీంతో ఓ పోలీస్ అధికారి స్వయంగా ఆ కోతికి నీటిని తాటించాడు..
మహారాష్ట్రలో మండిపోతున్న ఎండలకు ఓ కోతి దాహంతో విలవిల్లాడింది. రోడ్డుపై దాహంతో ఉన్న ఆ కోతికి అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ బాటిల్ ద్వారా నీటిని తాగించాడు. తీవ్ర దాహంతో ఉన్న ఆ కోతి ఏకంగా బాటిల్ నీళ్లను గుటగుటా తాగేసి దాహార్తిని తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. కోతి దాహం తీర్చిన ఆ కానిస్టేబుల్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Be kind wherever possible 💕💕
This video of constable Sanjay Ghude is circulating in SM for all the good reasons 🙏🙏 pic.twitter.com/oEWFC2c5Kx— Susanta Nanda IFS (@susantananda3) April 3, 2022