మరో సారీ వీడియో కాన్ఫరెన్స్..

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు ప్రధాని మోడీ సీఎంలతో సమావేశాల్లో పాల్గొంటారని పీఎం కార్యాలయం శుక్రవారం తెలిపింది.

 ఈనెల 16, 17న తేదీల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్ లు ఉంటాయని వెల్లడించింది. రెండు గ్రూపులుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి, వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. మరో సారి లాక్ డౌన్ విధించాలా వద్ద అన్న విషయాలపై చర్చించే అవకాశం ఉంది.  

ఇదిలా ఉండగా ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 10 వేల కేసులు నమోదయ్యాయి. కేసులు 3 లక్షలకు చేరుకున్నాయి. 

Leave a Comment