సైనికులతో ప్రధాని మోడీ దీపావళి..

సైనికులు సంతోషంగా ఉంటేనే దేశ ప్రజలు సంతోషంగా ఉంటారని, దేశాన్ని రక్షించే సైనికులను చూసి యావత్ భారత్ గర్వపడుతోందని ప్రధాని మోడీ తెలిపారు. శనివారం రాజస్థాన్ లోని జైసల్మెర్ లో ఆయన సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సైనికులతో కలిసి దీపావళి జరుపుకుంటేనే తనకు నిజమైన దీపావళి అని పేర్కొన్నారు. భారత సైనికులకు భారత ప్రజలందరి తరపు నుంచి దీపావళి శుభాకాంక్షలు తెలిపుతున్నానని చెప్పారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోడీ వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. ప్రజలంతా దీపాలు వెలిగించి దేశాన్ని కాపాడుతున్న సైనిక వీరులకు వందనం చేయాలని పిలుపునిచ్చారు. కాగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోడీ ప్రతి సంవత్సరం సైనికులతో కలిసి దీపావళి జరుపుకుంటున్నారు. జైసల్మెర్ లోని లొంగ్వాలాలో జరుగుతన్న ఈ వేడుకల్లో మోడీతో పాటు  బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ అస్థానా, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనే ఉన్నారు.  

 

Leave a Comment