ప్రధాని మోడీ 100 రూపాయల నాణెన్ని విడుదల చేశారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన విజయరాజే సింధియా శతజయంతి సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన స్మారక నాణెన్ని సోమవారం ప్రధాని మోడీ లాంచ్ చేశారు. రాజ్ సింధియాను గ్వాలియర్ రాజ్ మాతా అని కూడా పిలుస్తారు. ఆమె గౌరవార్థం ఈ 100 రూపాయల నాణెన్ని విడుదల చేశారు.
రాజ్ మాతా సింధియా తన భవిష్యత్తును దేశ భవిష్యత్తు కోసం అంకితం చేసిందని, దేశ భవిష్యత్ తరాల కోసం తన ఆనందాలన్నింటినీ త్యజించిందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు. రాజ్ సత్తా కన్నా జన్ సత్తా ముఖ్యమని రాజ్ మాతా నిరూపించారని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దాల వరకు ముఖ్య రాజకీయ ఘటనలకు రాజమాత సాక్షిగా నిలిచారని పేర్కొన్నారు.
విజయరాజే సింధియా రాజ వంశానికి చెందిన వారైనప్పటికీ చాలా సంవత్సరాలు జైలులో గడిపారని, ఎమర్జెన్సీ కాలంలో ఆమె తన కూతుళ్లకు జైలు నుంచే లేఖలు రాశారని మోడీ తెలిపారు. తాము ప్రస్తుతం చేస్తున్న పోరాటం, త్యాగాలువ భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలవాలని ఆ లేఖల్లో ప్రస్తావించారన్నారు. భవిష్యత్ తరాల కోసం ఆమె తన సుఖాలన్నీ విడిచి పెట్టారన్నారు.
Prime Minister @narendramodi releases commemorative coin of Rs. 100 denomination to celebrate the Birth Centenary of #RajmataVijayarajeScindia
Read here: https://t.co/4RXhfNsk3v pic.twitter.com/1Nz351TeAw
— PIB India (@PIB_India) October 12, 2020