లద్దాఖ్ లో పర్యటించిన ప్రధాని మోడీ..!

భారత ప్రధాని నరేంద్ర మోడీ లాద్దాఖ్ లో పర్యటించారు. చీప్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎన్ నారావణేతో లేష్ కు వెళ్లారు. లేష్ సమీపంలోని తిక్సే వద్ద ప్రధాని మోడీ భారత దళాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జూన్ 15న గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన విషయం తెలిసిదే..ఈ దాడిలో గాయపడిన సైనికులను కూడా ప్రధాని మోడీ పరామర్శించనున్నారు. ప్రధాని పర్యటన బలగాలకు ధైర్యాన్ని పెంచేదిగా మరియు చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా గట్టి సందేశం ఇవ్వనుంది. 

 

Leave a Comment