మోడీ విదేశీ పర్యటనల ఖర్చు తెలిస్తే షాకే..!

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్కువగా విదేశీ పర్యటనలు చేస్తుంటారు. గతంలో ఏ ప్రధాని చేయని విదేశీ పర్యటనలను ప్రధాని మోడీ చేశారు. అయితే ప్రధాని మోడీ విదేశీ పర్యటనల ఖర్చు ఎవరికీ తెలీదు.. తాజాగా ఆయన చేసే విదేశీ పర్యటనల ఖర్చును ప్రభుత్వం లోక్ సభలో వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోడీ 2015 నుంచి ఇప్పటి వరకు 58 దేశాలను సందర్శించారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ పేర్కొన్నారు. ఆయన పర్యటనలకు రూ.517 కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. ప్రధాని మోడీ చివరిసారిగా గత నవంబర్ లో బ్రెజిల్ దేశాన్ని సందర్శించినట్లు రాతపూర్వకంగా పేర్కొన్నారు.  

ప్రధాని మోడీ అమెరికా, రష్యా దేశాలను ఐదేసీ సార్లు చొప్పున సందర్శించారని, దీని వల్ల ద్వైపాక్షిక సంబంధాలు పెరిగాయని వెల్లడించారు. ప్రధాని మోడీ సింగపూర్, యూఏఈ, శ్రీలంక, జర్మనీ మరియు ఇతర దేశాలను పర్యటించారని పేర్కొన్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏ దేశాన్ని సందర్శించలేదని వెల్లడించారు. 

Leave a Comment