మినీ ఐపీఎల్ కు ప్లాన్..

కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి జరగాల్సిన ఇండియణ్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం ఏప్రిల్ 15 వరకు వీదేశీయుల వీసాలను రద్దు చేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు అప్పటివరకు సీజన్ కు అందుబాటులో ఉండరు. అంతే కాకుండా దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బీసీసీఐ టోర్నీని ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. ఇక ఆ తర్వాత అయినా ఐపీఎల్ ను నిర్వహించాలా ..లేదా అన్న విషయాన్ని గంగూలీ ఫ్రాంచైజీలతో శనివారం చర్చించారు. 

గతంలో మాదిరి కాకుండా 8 జట్లను 2 గ్రూపులుగా విభిజించి మినీ ఐపీఎల్ ప్లాన్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లీగ్ స్టేజ్ దాటి రెండు గ్రూపుల్లోనూ మొదటి రెండు స్థానాల్లో నిలిచిన 4 జట్లతో ప్లే ఆఫ్ నిర్వహించనున్నారు. అలాగే డబుల్ డెక్కర్ మ్యాచ్ లను పెంచి..ఎక్కువ వేదికల్లో కాకుండా రెండు లేదా మూడు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. అటు కొన్ని మ్యాచులను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కాగా, టోర్నీని విదేశాల్లో నిర్వహించే యోచనలో తాము లేమని బీసీసీఐ అధ్యక్షుడు స్పష్టం చేశారు. 

Leave a Comment