డ్రగ్ ఇన్ స్పెక్టర్ ఇంట్లో కట్టలుకట్టలుగా డబ్బు..!

బీహార్ రాజధాని పాట్నాలో అక్రమ ఆస్తుల కేసులో డ్రగ్ ఇన్ స్పెక్టర్ జితేంద్ర కుమార్ నివాసంపై విజిలెన్స్ విభాగం అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో ఈ దాడులు జరిపారు. డ్రగ్ ఇన్ స్పెక్టర్ వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బును లెక్కించడానికి విజిలెన్స్ అధికారులకు గంటల కొద్దీ సమయం పట్టింది. 

రూ.100 నుంచి రూ.2 వేల నోట్ల కట్టలను అధికారులు ఎంతో శ్రమతో లెక్కించారు. నగదుతో పాటు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు, భారీ మొత్తంలో బంగారం, వెండి, నాలుగు లగ్జరీ కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి వరకు లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ ఇంకా లెక్క పూర్తిగా తేలలేదు.. 

Leave a Comment