పాస్ పోర్టుల జారీ విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు క్లియరెన్స్ ఇచ్చే ముందు వారి సోషల్ మీడియా ఖాతాను పరిశీలించాలని ఉత్తరాఖండ్ పోలీసులు నిర్ణయించారు. సోషల్ మీడియాలో దేశానికి సంబంధించి అభ్యంతరకర పోస్టులు లేకపోతేనే పాస్ పోర్ట్ మంజూరు చేయనున్నారు.
పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల సోషల్ మీడియాలో దేశ ద్రోహానికి సంబంధించిన పోస్టులు చేసి ఉంటే మాత్రం వారికి పాస్ట్ పోర్టు జారీ చేయరు. సోషల్ మీడియాలో దుర్వినియోగాన్ని కట్టడి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ పేర్కొన్నారు.