భార్యకు పెళ్లి రోజు కానుకగా అద్దిరిపోయే గిఫ్టు.. చంద్రుడిపై స్థలం కొన్న యువకుడు..

భార్యపై ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చుటుకుంటారు. చీరలు కొంటారు..లేదా గిఫ్టులు ఇస్తారు.. కానీ పాకిస్తాన్ కు చెందిన ఈ యువకుడు మాత్రం తన భార్యకు ఊహించని గిఫ్టు ఇవ్వాలనుకున్నాడు. పెళ్లి రోజు కానుకగా ఏకంగా చందమామపై ఎకరం స్థలం కొని ఇచ్చాడు పాకిస్తాన్ లోని రావల్పిండికి చెందిన సొహైబ్ అహ్మద్…

చంద్రుడిపై సీ ఆఫ్ వేపర్ అనే ప్రదేశంలో, ఇంటర్నేషనల్ ల్యూనార్ రిజిస్ట్రీలో ఆ స్థలాన్న రూ.3,300 లకు కొనుగోలు చేశాడు..అదేంటీ ఇంత తక్కువ ధర అనుకుంటున్నారా? చంద్రుడిపై ఎవరూ ఇళ్లు కట్ట లేదు కాబట్టి ధరలు తక్కువగా ఉన్నాయి. 2018లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చంద్రుడిపై మారే ముస్కోవీన్స్ ప్రాంతంలో స్థలం కొన్నాడు. సుశాంత్ ను ప్రేరణగా తీసుకొని స్థలం కొన్నట్లు సొహైబ్ పేర్కొన్నాడు. 

Leave a Comment