రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్

ఢిల్లీ : ఏప్రిల్ ముగియనున్న రాజ్యసభ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిపికేషన్ జారీ చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో రెండు రాజ్యసబ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్  నుంచి ఎంఎ.ఖాన్, సుబ్బిరామిరెడ్డి, కె.కేవ్వరావు, తోట సీతారమామలక్ష్మి, తెలంగాణ నుంచి కేవీపీ.రామచందర్ రావు, గరికపాటి మోహన్ రావు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్..

  • మార్చి 6న నోటిఫికేషన్
  • నామినేషన్ల స్వీకరణకు మార్చి 13న తుదిగడువు
  • మార్చి 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
  • మార్చి 26న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
  • మార్చి 26న సాయంత్రం ఫలితాలు.

Leave a Comment