ఏపీలో 1,184 వైద్యుల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో 1,184 స్పెషలిస్టు డాక్టర్లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆసీఫర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ ఫిషియో కార్యదర్శి, రాష్ట్ర స్థాయి కరోనా నివారణ కమిటీ సభ్యులు(మీడియా మేనేజ్ మెంట్) తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 1,184 పోస్టుల్లో 592 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 192 అనస్తియాలజీ పోస్టులు, 400  జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్ పోస్టులు ఉన్నాయన్నారు.

ఈ పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుందన్నారు. ఎంపికైన వారు కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది పాటు పనిచేసే విధంగా ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్పెషలిస్టు వైద్యులకు రూ.1,10,000లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లకు రూ.53,945లు వేతనంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఆసక్తి, అర్హతల గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19 తేదీలోగా dme.ap.nic.in  ఆన్ లైన్లో అందజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు dme.ap.nic.in  వెబ్ సైట్ ను పరిశీలించాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్, ఎక్స్ ఫిషియో కార్యదర్శి, రాష్ట్ర స్థాయి కరోనా నివారణ కమిటీ సభ్యులు(మీడియా మేనేజ్ మెంట్) టి.విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

 

Leave a Comment