తల్లీకూతుళ్లపై దొంగబాబా అత్యాచారం.. చితకొట్టిన మహిళలు..!

భూతవైద్యం పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దొంగబాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో ఆ దొంగబాబాకు మహిళలు బడిత పూజ చేశారు. నిజామాబాద్ లోని పూసల గల్లీలో ఐదేళ్ల నుంచి భూవైద్యం మెడిటేషన్, క్షుద్ర పూజలు, ఆత్మల ప్రవేశం అంటూ ఓ బాబా మహిళలను లొంగదీసుకుంటూ వస్తున్నాడు. ఈక్రమంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న ఓ తల్లీ, కూతరు ఇటీవల బాబాను ఆశ్రయించారు. 

ఆ బాబా ఆమాయకులైన తల్లీకూతురికి మాయమాటలు చెప్పాడు. తర్వాత వారిని లోబరుచుకున్నాడు. ముందు తల్లిపై ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత మూడు నెలలుగా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈక్రమంలో బాలికకు కడుపునొప్పి వచ్చింది.  దీంతో వారు వైద్యులను సంప్రదించగా ఆ బాలిక మూడు నెలల గర్భవతి అని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్ కు గురై మహిళా సంఘాలను ఆశ్రయించారు. 

దీంతో ఆ దొంగబాబా కార్యాలయానికి వచ్చిన మహిళా సంఘాల ప్రతినిధులు ఆ బాబాను చితకబాదారు. మరో వైపు ఆ బాబా బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ బాబా ఎవరైనా మహిళలు వైద్యం పేరుతో తన వద్దకు రాగానే వారికి మత్తు మందు ఇస్తాడు. తర్వాత వారిని వివస్త్రగా మార్చి లైంగిక దాడికి పాల్పడతాడు. ఎవరికైన చెబితే చంపేస్తామని బెదిరించేవాడు. గతంలోనూ అనేక మంది వేధింపులకు గురయ్యామని బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం దొంగబాబా పోలీసుల అదుపులో ఉన్నాడు. 

Leave a Comment