ఆదాయపు  పన్ను కొత్త నియమాలు..

ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరం యథావిధిగా మార్చి 31న ముగిసింది. బుధవారం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2020-21 ప్రారంభమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ కారణంగా, ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువును పొడగించింది. అదే విధంగా పాన్ ను ఆధార్ తో లింక్ చేయడానికి జూన్ 30 వరకు మూడు నెలల వరకు పెంచింది. 2020 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు ఏప్రిల్ 1 నుంచి కొన్ని ఆదాయపు పన్ని నియమాలు అమల్లోకి వస్తాయి. అవి ఏమిటంటే..

  • బడ్జెట్ 2020లో ప్రకటించినట్లు కొత్ పన్ను స్లాబ్ లు అమల్లోకి వస్తాయి. అయితే పాత స్లాబ్ లు కూడా అమల్లో ఉంటాయి. టాక్స్ హోల్డర్లు ఈ రెండింటిలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. 

కొత్త టాక్స్ నిబంధనల ప్రకారం 

  • రూ.2.5 లక్షల ఆదాయం కలిగిన వారికి సున్నా శాతం పన్ను
  • రూ.2.5 శాతం నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం కల వారికి 5 శాతం పన్ను.
  • రూ.5 నుంచి రూ.7.5 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను.
  • రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం  ఉన్న వారికి 15 శాతం టాక్స్.
  • రూ.10 నుంచి రూ.12.5 లక్షల మధ్య ఉన్న వారికి 20 శాతం టాక్స్
  • రూ.12.5 నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి 25 శాతం టాక్స్.
  • రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి 30 శాతం పన్ను విధించబడుతుంది. 

కానీ ఈ కొత్త పన్ను రేట్ల కింద వ్యక్తి ప్రామాణిక తగ్గింపు, సెక్షన్ 80 సి కింద జనాదర్ణ పొందిన తగ్గింపులు, ఇంటి అద్దె భత్యంపై మినహాయింపులు, సెలవు ప్రయాణ భత్యం(ఎల్టీఎ) వంటి పన్న పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడంలో సహాయపడే చాలా తగ్గింపులను వదులుకోవలసి ఉంటుంది. 

  • మ్యూచువల్ ఫండ్స్ మరియు దేశీయ కంపెనీల నుంచి పొందిన డివిడెండ్లు గ్రహీతల చేతిలో పన్ను విధించబడతాయి. ఉదాహరణకు గ్రహీతలు వారి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి సంపాదించే డివిడెండ్లను వారి స్లాబ్ రేట్లకు పన్ను విధించబడుతుంది. అయితే మ్యూచువ్ ఫండ్ ఈక్విటీ – ఆధారిత ఫండ్లకు 11.2 శాతం మరియు రుణ ఆధారిత ఫండ్లకు 29.12 శాతం చొప్పున డివిడెండ్ పంపిణీ పన్నును తగ్గించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను పాలసి పెట్టుబడిదారులపై అధిక పన్ను పరిధిలో పన్ను భారాన్ని పెంచుతుంది. అదే సమయంలో తక్కువ పన్ను పరిధిలో ఉన్న వారికి దీనిని తగ్గిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదారుడు అందుకున్న డివిడెండ్ రూ.5వేలు దాటితే 10 శాతం చొప్పున టీడీఎస్ లేదా 10 చొప్పున పన్ను మినహాయింపు ఉంటుంది.
  • ఎన్పిఎస్, సూపర్ న్యునేషన్ ఫండ్ మరియు ఇపీఎఫ్ లలో యజమాని సహకారం సంవత్సరంలో రూ.7.5 లక్షలకు మించి ఉంటే, పన్నును ఉద్యోగి కట్టవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను నిబంధనలో ఈ మార్పు పాత మరియు కొత్త పన్ను పాలసీలకు వర్తిస్తుంది. ఒక వ్యక్తి కొత్త పన్ను స్లాబ్ లను ఎంచుకుంటే, అతను ఉద్యోగి యొక్క ఎన్పీఎస్ ఖాతా పట్ల యజమాని సహకారంపై ఆదాయపు పన్ను మినహాయింపును పొందవచ్చు. మీ యజమాని మీ ఎన్పీఎస్ ఖాతాకు సహకరిస్తుంటే, ఏదైనా పరిమితితో సంబంధం లేకుండా 10 శాతం వరకు జీతం మినహాయింపు, సెక్షన్ 80 సిసిడీ(2) కింద ఆదాయపు పన్ను మినహాయింపుకు అర్హత పొందుతారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతంలో 14 శాతం అధిక పరిమితిని పొందుతారు.
  • రూ.45 లక్షల విలువ గల ఇల్లును మొదటి సారి కొంటున్న వారికి ప్రభుత్వం అదనపు పన్ను ప్రయోజనం పొందే తేదీని మార్చి 31, 2021 వరకు పొడగించింది. రూ.45 లక్షల వరకు గృహాలను కొనుగోలు చేయడానికి రుణాలు తీసుకున్న గృహ యజమానులు ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల తగ్గింపుకు అదనంగా వడ్డీపై రూ. 1.5 లక్షల అదనపు పన్ను మినహాయింపును పొందటానికి అర్హులు.
  • స్టార్టప్ ఉద్యోగులకు ఉపశమనం కలిగించే విధంగా, ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను పాలసి ESOP లేదా ఉద్యోగుల స్టాక్ యాజమాన్య ప్రణాళిక ప్రకారం వారికి కేటాయించిన వాటాలపై పన్ను చెల్లింపును వాయిదా వేయడానికి అనుమతిస్తుంది. కొత్త పన్ను పాలసి ప్రకారం ప్రారంభించినప్పటి నుంచి 48 నెలల వరకు పన్ను చెల్లింపును వాయిదా వేసింది.  

Leave a Comment