‘మిమ్మల్ని అక్కా అని పిలవాలా లేదా ఆంటీ అని పిలవాలా?’.. అనసూయకు నెటిజన్ సూటి ప్రశ్న..!

అనసూయ టాలీవుడ్ లో యాంకర్ గా అడుగుపెట్టి ఇప్పుడు నటిగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. విభిన్నమైన పాత్రం చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల అనసూయ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ద్రాక్షాయణి పాత్రలో నటించి మెప్పించింది. అనసూయ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. 

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో అనసూయ చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈక్రమంలో ఓ నెటిజన్ నుంచి అనసూయకు కొంటె ప్రశ్న ఎదురైంది. ‘మిమ్మల్ని అక్కా అని పిలవాలా లేదా ఆంటీ అని పిలవాలా’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి అనసూయ స్పందిస్తూ ‘ఏదీ వద్దు. అలా పిలిచే అంత స్నేహం మన మధ్య లేదు. ఇలా పిలుస్తామని అనడం మీ పెంపకాన్ని ప్రశ్నిస్తుంది. ఇది ఏజ్ షేమింగ్ చేసినట్లే. గౌరవం ఇవ్వండి’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. 

అనసూయ ఇచ్చిన సమాధానానికి మరో నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఎవరైనా అక్కా అని పిలిచినంత మాత్రానా ఏజ్ షేమింగ్ అవ్వదు. అలాంటప్పుడు ప్రశంసలు కూడా తీసుకోవద్దు’ అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ సమాధానం చెబుతూ.. ‘అయ్యుండొచ్చు.. కానీ ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారన్నది ముఖ్యం. అయినా కాంప్లిమెంట్స్ తీసుకోవాలా వద్ద అన్నది వాళ్ల ఇష్టం కదా’ అంటూ సమాధానం ఇచ్చింది.  

Leave a Comment