బుర్జ్ ఖలీఫాపై జాతీయ జెండా.. కరోనాపై పోరుకు దుబాయ్ మద్దతు..!

భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా నమదవుతున్నాయి. దేశంలో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్ కు పలుదేశాలు మద్దతు తెలిపాయి. అమెరికా, యూకే, జర్మనీ, యూఏఈ తదితర దేశాలు తమ వంతు సాయం అందించడం కోసం ముందుకొచ్చాయి. 

భారత్ కు మద్దతు తెలుపుతూ దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై భారతదేశ జాతీయ జెండాను ప్రదర్శించారు. ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అనే సందేశాన్ని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాయలం ఆదివారం ట్వీట్ లో ప్రపంచంలోని ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫాపై భారత జాతీయ జెండాను 17 సెకన్ల పాటు ప్రదర్శించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.  

Leave a Comment