టెన్త్ విద్యార్థులతో నారా లోకేశ్ జూమ్ మీటింగ్.. సడెన్ గా ప్రత్యక్షమైన కొడాలి నాని, వంశీ..!

పదో తరగతి విద్యార్థులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఈ మీటింగ్ లో సడెన్ గా ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యారు. దీంతో వెంటనే టీడీపీ లైవ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది ఈ మీటింగ్ ను కట్ చేశారు.

ఏపీలో ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాలపై విద్యార్థులతో నారా లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. లోకేశ్ ఒక్కో విద్యార్థికి మాట్లాడే అవకాశం కల్పిస్తుండగా.. ఓ విద్యార్థి వంతు రాగానే వల్లభనేని వంశీ, కొడాలి నాని సహా కొందరు వైసీపీ నేతలు ఆ మీటింగ్ లో ఎంట్రీ ఇచ్చారు. విద్యార్థులు లాగిన్ అయిన ఐడీలలోనే వీరు కనిపించటంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. 

ఈ మీటింగ్ లో వైసీపీ నేత దేవేందర్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేయగా.. పది పరీక్ష ఫలితాలపై నారా లోకేశ్ నిలదీసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మీటింగ్ నిర్వాహకులు మీటింగ్ ని కట్ చేశారు. వైసీపీ నేతలు సడెన్ గా మీటింగ్ లో ప్రత్యక్షమవడంపై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ఇలా దొంగచాటుగా రావడమేంటని, డైరెక్ట్ గా వస్తే అన్ని విషయాలు మాట్లాడుతానని సవాల్ విసిరారు. 

 

Leave a Comment