గాల్లో తిరుగుతూ.. గాలి కబుర్లు చెబితే ఇబ్బందులు తొలగిపోతాయా : నారా లోకేష్

టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. సీఎం జగన్ గాల్లో తిరుగుతూ, గాలి కబుర్లు చెబితే రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయా అని ప్రశ్నించారు. ‘ప్రతి పక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరదసాయంగా 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి.. ఇప్పుడు 500 ఇస్తామనడం రివర్స్ టెండరింగ్ లో భాగమా?’ అని అన్నారు. 

‘నివర్ తుఫాన్ 10 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపి రైతున్న నడ్డి విరిచింది. సుమారు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వెయ్యి కోట్లపైన పంట నష్టం వాటిల్లింది. వరుస తుపాన్లు, వరదలతో రైతులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతే అంచనాలు వేయరు, పరిహారం ఇవ్వరు. గాల్లో మేడలు కడుతూ, గాలి తిరుగుళ్లు ఆపి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అంతులేని తుపాన్ నష్టం తెలుస్తుంది. మీ సాక్షి మీడియా ప్రకటనలు, భజన బ్యాచ్ నుంచి వాస్తవంలోకొస్తే అన్నదాతల ఆర్తనాదాలు వినపడతాయి. తాడేపల్లి గడప దాటి ప్రజల్లోకొస్తే జనం కన్నీళ్లు కనిపిస్తాయి.’ అంటూ విమర్శలు చేశారు.

Leave a Comment