‘డబ్బులివ్వు.. లేకుంటే చావు’.. పెళ్లికి ముందే కోట్నం కోసం వరుడి వేధింపులు..!

ప్రాణంగా ప్రేమించింది. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకుంది. అప్పటి వరకు ఎంతో ప్రేమ నటించిన ఆ యువకుడు.. పెళ్లి నిశ్చితార్థం జరిగాక అసలు స్వరూపం బయటపెట్టాడు. పెళ్లికి ముందే వేధించడం మొదలు పెట్టాడు. ప్రేమించిన వాడు వేధిస్తుండటంతో తట్టకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఓ యువతి తన ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. 

వివరాల మేరకు అనుముల మండలం పంగవానికుంటకు చెందిన నవత(22), త్రిపురాం మండలంలోని లక్పతి తంండాకు చెందిన ధనావత్ జగపతిబాబు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసి రెండు కుటుంబాల వారు వీరికి నిశ్చితార్థం చేశారు. కట్నం కింద రూ.20 లక్షలు విలువ చేసే ప్లాటుతో పాటు రూ.80 వేల నగదు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. 

అయితే ఆ వరుడు వాటికి సంతృప్తి పడలేదు. ఆ ప్లాటు అమ్మి డబ్బులు ఇవ్వాలని నవతను వేధించాడు. ఆదివారం రాత్రి ఫోన్ చేసి తిట్టాడు. ‘పైసలు ఇవ్వు.. లేకపోతే చావు’ అని మేసేజ్ పెట్టాడు. దీంతో నవత మనస్తాపానికి గురైంది. సోమవారం ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment