భీమవరం సభలో చిరంజీవి తప్ప.. అందరూ అద్భుతంగా నటించారు.. నాగబాబు ట్వీట్

 భీమవరంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరై.. అల్లూరి విగ్రహావిష్కరణ చేశారు. మోదీతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, మంత్రి రోజా, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.  

ఈ సభపై జసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సినీ నటుడు కొణిదెల నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ‘మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది. ఆ మహానుభావుడికి నా నివాళి. ఆ సభలో మా అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారు. ఆ మహా నటులందరికీ నా అభినందనలు’ అంటూ ట్వీట్టర్ లో పేర్కొన్నారు..  

Leave a Comment