‘విగ్గు గారి పెగ్గు’

సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తరచూ విమర్శలు చేస్తుంటారు. దీనిపై వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడుతున్నారు. రఘురామకృష్ణంరాజు సభ్యత్వాన్ని రద్దు చేయిస్తామని రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ ఇటీవల పేర్కొన్నారు. కాగా, రఘురామకృష్ణంరాజుపై స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే..తమ పార్టీ టికెట్ పై గెలిచిన రఘురామకృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తాజాగా వైసీపీ మద్దతుదారులు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ విదేశీ యువతి పెగ్గు పోస్తుంటే రఘురామకృష్ణంరాజు ఆస్వాదిస్తున్నారు. ‘విగ్గు గారి పెగ్గు ’ అనే క్యాప్షన్ తో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రఘురామకృష్ణంరాజు ఎలాంటి వాడో తెలిసే టిక్కెట్ ఇచ్చారు.. మీ పరువును మీరే బాజారున పడేసుకుంటున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Leave a Comment