పేదరికంతో కన్నబిడ్డనే అమ్ముకున్న తల్లి..!

పేదరికంతో ఓ తల్లి తన పేగుబంధాన్నే అమ్మేసింది. మూడు నెలల పసికందును రూ.1.78 లక్షలకు అమ్ముకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా షిర్డీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తల్లితో పాటు ఆమెకు సహకరించిన నలుగురిని, శిశువును కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

షిర్డీకి చెందిన ఓ మహిళ చాలా పేదరింలో జీవనం కొనసాగిస్తోంది. ఈక్రమంలో ఆమె సెప్టెంబర్ లో ఆమెకు ఓ బిడ్డ పుట్టాడు. అయితే ఆమె పరిస్థితి ఎలా ఉందంటే.. ఆ బిడ్డ ఆలనాపాలనా చూసుకునే స్తోమత కూడా లేదు. దీంతో ఆ బిడ్డను అమ్ముకోవాలని నిర్ణయించుకుంది. ఆ బిడ్డను అమ్మేందుకు ఆమెకు అహ్మద్ నగర్, థానేకు చెందిన కళ్యాణ్, ముంబైలోని ములుంద్ కు చెందిన ముగ్గురు మహిళలు సహకరించారు.   

ములుంద్ కు చెందిన వ్యక్తికి ఎలాంటి చట్టబద్ధమైన లాంఛనాలు పూర్తి చేయకుండానే బిడ్డను రూ.1.78 లక్షలకు అమ్మేశారు. అయితే ఇలా కొనుగోలు చేసిన విషయం గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ వ్యక్తి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అక్కడ శిశువు కనిపించింది. దీంతో బిడ్డ తల్లితో సహా నలుగురి పోలీసులు అరెస్ట్ చేశారు. 

Leave a Comment