మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దువే ఎన్ కౌంటర్..!

ఉత్తర ప్రదేశ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే శుక్రవారం పోలీస్ ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. గురువారం ఉదయం ఉజ్జయినిలోని మహాకల్ ఆలయం బయట వికాస్ దుబే పట్టుబడ్డాడు. వికాస్ దుబే ఉత్తరప్రదేశ్ లో 8 మంది పోలీసులను కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు. దుబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ కు కారులో తరలిస్తుండగా..వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్ దుబే పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాాల్పుల్లో అతడు మరణించాడు. వికాస్ దుబేను పట్టుకునే ప్రయత్నంలో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలిసింది. 

Leave a Comment