ఇకపై నో సోషల్ మీడియా..

ప్రధాని మోడీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల నుంచి తన అకౌంట్ ను వచ్చే ఆదివారం తొలగించే యోచనలో ఉన్నట్లు ట్వీట్ చేశారు. 

ప్రధాని మోడీ ఫేస్ బుక్ లో 4 కోట్ల 47 లక్షల మంది పాలో అవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా 3 కోట్ల 52 లక్షల మంది ఫాలో అవుతుండగా, ట్విటర్ ద్వారా 5 కోట్ల 33 లక్షల మంది అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లన్నీ కలపుకుంటే దాదాపు 15 కోట్ల మంది ప్రధానిని ఫాలో అవుతున్నారు. అంతటి ఫాలోయింగ్ ఉన్న ప్రధాని మోడీ షోషల్ మీడియా నుంచి తప్పుకుంటానని అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 

Leave a Comment