ప్రధాని మోడీ సోమవారం మధ్యాహ్నం వారణాసిలో పర్యటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గానికి తొలిసారిగా వెళ్లారు. అక్కడ దీపం వెలిగించి ‘దేవ్ దీపావళి’ మహోత్సవాన్ని ప్రారంభించారు. అంతకు ముందు ఆయన వారణాసిలో ప్రసంగించారు. నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన వెనుక విపక్షాలు ఉన్నాయని ఆరోపించారు.
అనంతరం ఆయన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో పూజలు చేశారు. కాశీలో ఏర్పాటు చేసిన లేజర్ లైట్లు మరియు సౌండ్ షోను ప్రధాని మోడీ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Har Har Mahadev! pic.twitter.com/k2XD2Q74xl
— Narendra Modi (@narendramodi) November 30, 2020
Dev Deepavali and the affection of the people of Kashi! 🙏🏼 pic.twitter.com/XRgcL9WR1v
— Narendra Modi (@narendramodi) November 30, 2020