భారత్ బయోటెక్ ను అభినందించిన మోడీ..

హైదరాబాద్ లో ప్రధాని మోడీ పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా ఆయన భారత్ బయోటెక్ ను సందర్శించారు. అక్కడ శాస్త్రవేత్తలతో కరోనా వ్యాక్సిన్ పురోగతిపై సమీక్షించారు. వ్యాక్సిన్ తయారీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు భారత్ బయోటెక్ ఐసీఎంఆర్ తో కలిసి పనిచేస్తోందని, కరోనా నిరోధానికి స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని పేర్కొన్నారు. అనంతరం అందరికి అభివాదం చేస్తూ పూణెకు పయనమయ్యారు. 

Leave a Comment