టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్.. వైసీపీ నేతలకు బాలకృష్ణ వార్నింగ్..!

టీడీపీ కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని హిందూపురం ఎమ్మెల్యేబాలకృష్ణ హెచ్చరించారు. చిలమత్తూరు మండలం కొడికండ్లలో ఇటీవల వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా టీడీపీ నాయకులపై జరిగిన దాడిని బాలకృష్ణ ఖండించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే ఊరుకొనేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తాము తిరగబడతామన్నారు. ప్రతిదానికి సహనం ఉంటుందని, వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఆలోచనలు మళ్లీ వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. 

వైసీపీకి తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా వైసీపీ నేతలను ఎలా తరిమికొడుతున్నారో చూస్తున్నామని తెలిపారు. టీడీపీ కార్యకర్తలకు కష్టం వస్తే అర్ధ రాత్రి అయినా సరే వస్తానని బాలకృష్ణ హాహీ ఇచ్చారు. 

Leave a Comment