అత్యధిక సంతానం ఉంటే రూ.లక్ష బహుమతి.. మిజోరం మంత్రి బంపర్ ఆఫర్..!

మిజోరం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రొమావియా బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న తల్లిదండ్రులకు రూ.లక్ష నగదు బహుమతి అందిస్తానని వెల్లడించారు. ఫాదర్స్ డే సందర్భంగా ఆయన ఈ ప్రకను చేశారు. మిజో తెగల్లో జనాభాను పెంచేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్లు మంత్రి పేర్కొన్నారు. 

మంత్రి రాబర్ట్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఐజ్వాల్ తూర్పు-2 పరిధిలో అత్యధిక సంతానం ఉన్న తల్లి లేదా తండ్రికి రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందిస్తాననమి ప్రకటించారు. నగదు బహుమతితో పాటు ట్రోఫీ కూడా అందజేస్తానని తెలిపారు. అయితే ఎంతమంది పిల్లలు అనేది స్పష్టంగా చెప్పలేదు..

మిజో వర్గంలో జనాభా తగ్గుదల ఆందోళనకరంగా మారుతోందని మంత్రి రాబర్ట్ పేర్కొన్నారు. కొన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఈ జనాభా సరిపోవడం లేదని, మిజో లాంటి గిరిజన తెగలకు ఇది సమస్యగా తయారవుతోందని చెప్పారు. అందుకే ఈ తెగల్లో జనాభాను పేంచేందుకు ఈ నగదు ప్రోత్సహకాన్ని ప్రకటించామని స్పష్టం చేశారు. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరం జనాభా 10,91,014 ఉంది. దేశంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన రెండో రాష్ట్రం మిజోరం..

Leave a Comment