ప్రాథమిక విద్యలో తొలిసారిగా ‘మిర్రర్ ఇమేజ్ బుక్స్’..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థపై సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ ఏడాది నుంచి విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇటు తెలుగుతో పాటు అటు ఇంగ్లీష్ లోనూ విద్యార్థులు రాణించేలా ప్రోత్సహిస్తూ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ మార్పు ప్రక్రియ సరళంగా జరిగేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఎలిమెంటరీ స్థాయిలో ‘మిర్రర్ ఇమేజ్ పాఠపుస్తకాలు’ అందించేందుకు సిద్ధమైంది. 

రెండు మాధ్యమాల్లో పాఠ్యాంశాలు ఉండటం ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బోధన సులభం కానుంది. ఇప్పటికే మనబడి నాడు-నేడు ద్వారా సరికొత్తగా తీర్చిదిద్దిన పాఠశాలలు పున:ప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు సిలబస ను మార్చింది. విద్యార్థులకు సులభంగా ఉండేలా విద్యారంగ నిపుణులతో సరికొత్తగా పాఠ్యాంశాలన రూపొందించింది. ఈ పుస్తకాలను సరికొత్తగా మిర్రర్ ఇమేజ్ తరహాలో ఒక పేజీలో తెలుగు ఎదుటి పేజీలో ఇంగ్లీష్ లో పాఠ్యాంశాలు ఉండేలా రూపొందించారు. 

రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ నిపుణుల సహకారంతో తెలుగు-ఇంగ్లీష్ భాషల్లో తొలిసారిగా రూపొందించిన మిర్రర్ ఇమేజ్ పాఠ్య పుస్తకాలను ఈ ఏడాది నుంచి విద్యార్థులకు అందించనున్నారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు తెలుగు-ఇంగ్లీష్ గణితం సిలబస్ లో మార్పులు చేశారు. ఈ వీఎస్ ఇకపై 3వ తరగతి నుంచి ఉండేలా సిలబస్ రూపకల్పన చేశారు. 

ఆరో తరగతిలో సోషల్ హిందీ పాఠ్యాంశాల్లో మార్పులు చేశారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వర్క్ బుక్స్ అందించనున్నారు. గతంలో కేవలం 25 మంది కవుల రచనలే ఉండగా, ఈసారి అన్ని ప్రాంతాలు మాండలికాలు సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికిపైగా కవుల రచనలను పాఠ్యాంశాలుగా చేర్చారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రాథమిక విద్యలో సెమిస్టర్ విద్యా విధానం అమలులోకి తెస్తున్నారు. పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగా విద్యార్థులకు అందజేస్తారు. 

Leave a Comment