ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న బ్యాంకుల సంఖ్య

ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల సంఖ్య తగ్గునున్నాయి. బ్యాంకుల విలీనానికి ఆర్ బీఐ ఆమోదముద్ర వేసింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించిన బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో బ్యాంకుల సంఖ్య 10 నుంచి 4కు తగ్గనుంది. 

ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకులు బ్రాంచులు అన్ని మెయిన్ బ్యాంక్ బ్రాంచులుగా మారిపోతాయి. అంటే ఓరియెంటల్ బ్యంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచులు పీఎన్ బీ బ్యాంకులుగా పనిచేస్తాయి.

సిండికేట్ బ్యాంక్ బ్రాంచులు కెెనరా బ్యాంక్ బ్రాంచ్లుగా ఉంటాయి. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులుగా మారిపోతాయి. అలహాబాద్ బ్రాంచ్
ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ లో కలిసిపోతుంది. 

విలీనం తర్వాత దేశంలో ప్రభుత్వ రంగానికి చెందిన ఏడు పెద్ద బ్యాంకులు, ఐదు చిన్న బ్యాంకులు మాత్రమే ఉంటాయి. 2017లో దాదాపు 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి. విలీనం తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో అతిపెద్ద బ్యాంక్ గా అవతరిస్తుంది. ఎస్ బీఐ అతిపెద్ద బ్యాంక్ గా కొనసాగుతోంది. ఇక బ్యాంక్ ఆప్ బరోడా మూడో అతి పెద్ద బ్యాంక్ అవుతుంది.

దీని తర్వాతి స్థానాల్లో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఉంటాయి. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ అనేవి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులుగా ఉంటాయి. 

Leave a Comment