మాస్కు ధరించడం వీరుని లక్షణం : కరోనాపై చిరు సందేశం

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది. భారత్ లోనూ కరోనా రికార్డు స్థాయిలో నమోదువుతోంది. కరోనా నుంచి రక్షణ పొందాలంటే మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం అంటూ ప్రధాని మోడీ ప్రతి సమావేశంలోనూ ప్రజలకు సూచిస్తున్నారు. కరోనాపై అవగాహన పెంచేందుకు సెలబ్రెటీలు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. 

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా మాస్కు ధరించడంపై సందేశం ఇచ్చారు. మీసం మేలేయడం వీరత్వం..అది ఒకప్పుడు..ఇప్పుడు మొఖానికి మాస్కు ధరించడం వీరుని లక్షణం..అంటూ ఓ వీడియోలో హీరో కార్తికేయకు చిరంజీవి మాస్కు విసురుతారు. కార్తికేయ కూడా ఎస్ బాస్ అంటూ మీసం మేలేసే మాస్కు ధరిస్తాడు. చిరు సందేశం కోసం కింది వీడియో చూడండి..


Leave a Comment