మెగా హీరో సాయి ధరమ్ తేజ కి భారీ ప్ర ..మాదం .. తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో …

తాజా వార్తల ప్రకారం …సాయి ధరమ్ తేజ్ కొంత సేపటి క్రితం ప్రమాదానికి గురి అయినట్లు తెలిసింది . ఈ ప్రమాదం జరిగిన అనంతరం తేజ్ ని హాస్పిటల్ కి తెసుకోవేల్లినట్లు సమాచారం అందింది .ఆ తర్వాత అతన్ని మాదాపూర్ లోని మేడికోవర్ హాస్పిటల్ కి తీస్కోవెళ్ళినట్లు సమాచారం . అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అంటే .సాయి ధరమ్ తేజ్ తన రాబోయే సినిమా రిపబ్లిక్ ప్రమోషన్ కోసం అని అతని  ఆఫీస్ కి  వెళ్లి ,ఆ పని పూర్తీ అయ్యాక తిరిగి వెళ్ళే సమయం లో ఈ సంఘటన జరిగింది .

సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్ నగరం లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైన తన స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది . ఈ జరిగిన సంఘటన సిసి కెమెరా లో రికార్డు అయింది .ఆ సంఘటన జరిగిన తర్వాత సాయి ధరమ్ తేజ్ స్పృహ కోల్పోయాడు .స్పృహ కోల్పోవటం తో వెంటనే దగ్గరలోని మేడికోవర్ హాస్పిటల్ కి తరలించారు అని తెలుసుతుంది .

సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు .అతి వేగం వల్లనే ఈ ప్రమాదం కి గురి అయ్యారు అని అక్కడి CI తెలిపారు . గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఆక్సిడెంట్ అయిన బండి నెంబర్ TS07GJ1258 అని పోలీసులు గుర్తించారు .

వెంటనే సాయి ధరమ్ తేజ్ కుటుంభ సభ్యలకు సమాచారం అందించారు .ఇక వెంటనే ఈ సంఘటన ఎలా జరిగిందని ఆ బ్రిడ్జ్ మీద ఉండే సి సి కెమెరా ల ద్వారా పరిశీలిస్తున్నారు . అయితే వైద్యులు సాయి ధరమ్ తేజ్ కి వైద్యం అందించి క్హేమం గానే ఉన్నారు అని తెలిపారు .

ఇక ఇటు ఈ వార్త తెలిసిన హీరో అభిమానులు కొంచం ఆందోళనికి గురి అయ్యారు .

 

Leave a Comment