ఏపీలో మాస్కు తప్పనిసరి..లేకుంటే కఠిన ఆంక్షలు..!

ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో, కార్యాలయాల్లో, ప్రయాణ సమయాల్లో మాస్క్ ను కచ్చితంగా ధరించాలని ఆదేశించింది. 

కేంద్ర ప్రభుత్వం సూచించిన నిర్దేశిత ప్రయాణ సమయాల్లో భాగంగా ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పింది. నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు కూడా విధిస్తామని వెల్లడించింది. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించింది. 

Leave a Comment