సిల్లీ కారణంతో పెళ్లి రద్దు చేశారు..!

సామాన్యంగా పెళ్లి ఆగిపోవాలంటే ఏవో పెద్ద కారణాలు ఉండాలి. కానీ మహారాష్ట్రలోని ముంబైలో ఓ పెళ్లి సిల్లీ కారణంతో ఆగిపోయింది. సింధూరం క్వాలిటీగా లేదన్న కారణంతో పెళ్లి కుమారిడి తరపు వారు పెళ్లి రద్దు చేసుకున్నారు. ముంబైలో నీరజ్ పాటెల్ అనే ఓ ఇంజినీర్ కి, ఓ డాక్టర్ అమ్మాయికి పెళ్లి కుదిరింది. అప్పటి నుంచి ఫోన్లు, మెసేజ్ చేసుకున్నారు.  

ఈనేపథ్యంలో ఫిబ్రవరి 28న పెళ్లికి ముందు జరిగే తిలక్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్ లో ఇరు కుటుంబాల వారు పాల్గొన్నారు. అయితే రెండు రోజుల తర్వాత పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు నీరజ్ కుటుంబం తెలిపింది. ఆ తర్వాత నీరజ్ పెళ్లి కూతురుకి ఫోన్ చేసి తమ అమ్మానాన్నలను నువ్వు, మీ అమ్మ అవమానించారు. నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో ఆమె షాక్ కు గురైంది. 

అసలు విషయం  తెలుసుకునేందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు నీరజ్ ఇంటికి వెళ్లినా.. అక్కడ వారిని బయటకు నెట్టేశారు. దీంతో పెళ్లి కూతురు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. సింధూరం నాణ్యత బాగలేదని, అందుకు బంధువులు తమను అవమానించారని నీరజ్ కుటుంబం తెలిపింది. మంచి నాణ్యత గల సింధూరం తేవాలని చెప్పినా వారు పట్టించుకోలేదన్నారు. అందుకే పెళ్లి రద్దు చేసుకున్నామని వారు విచారణలో చెప్పారు.  

Leave a Comment