కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర అవార్డు..!

గాల్వాన్ లోయలో చైనా సైనికులతోొ జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు అమరుడైన సంగతి తెలిసిందే.. గతేడాది జూన్ 15న లఢఖ్ సమీపంలోని వాస్తవాదీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు జరిపిన దాడిలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. 

దేశ రక్షణలో అమరుడైన జవాన్ కు కేంద్ర ప్రభుత్వం అరుదైన అవార్డు ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కల్నల్ సంతోష్ కు ‘మహావీరచక్ర’ అవార్డును అందిస్తున్నట్లు చెప్పింది. ఆయన కుటుంబ సభ్యులకు ఈ అవార్డును అందించనున్నారు. కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం దక్కడం సంతోషంగా ఉందని, తమ కుమారిడి త్యాగానికి పరమవీర క్ర ఇస్తే బాగుండేదని సంతోష్ బాబు తల్లి మంజుల తెలిపారు.  

Leave a Comment