ఆరుగురు పిల్లలను బావిలోకి తోసేసి చంపిన తల్లి..!

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. తన ఆరుగురు మైనర్ పిల్లలను బావిలో పడేసి.. తానూ దూకేసింది.. ఈఘటన మహారాష్ట్ర రాయ్ గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు పిల్లలు చనిపోగా.. తల్లి బతికింది. 

వివరాల మేరకు మహాడ్ తాలుకాలోని ఖారావళి గ్రామానికి చెందిన దంపతులకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. భర్త తాగుడుకు బానిసై రోజూ వేధిస్తుండేవాడు. ఈక్రమంలో సోమవారం భార్యాభర్తలు ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ తన ఆరుగురు పిల్లలను బావిలోకి తోసేసి.. తాను కూడా దూకేసింది. 

స్థానికులు ఆమెను రక్షించారు. చనిపోయిన వారిలో ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు. మరణించిన పిల్లల వయసు 18 నెలల నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. 

 

Leave a Comment